కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

హైదరాబాద్ మార్చి 19″అనంత జనశక్తి న్యూస్”

పార్టీ నమోదు వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత స్థాపించనున్న కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ నమోదు అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భారత ఎన్నికల సంఘంకు కోర్టు సూచించింది.ఇంతకుముందు కవిత దాఖలు చేసిన దరఖాస్తులో లోపాలు ఉన్నాయని ఈసీ పేర్కొనగా, వాటిని పూర్తిగా సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సాంకేతిక లోపాలను నివారించి మళ్లీ దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నమోదు అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసింది.