
నరసరావుపేట బిజెపి నూతన వన్ టౌన్ పట్టణ అధ్యక్షులు రూరల్ మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్
నరసరావుపేట,నవంబర్ 24. అనంత జనశక్తి న్యూస్
స్థానిక ప్రకాష్ నగర్ లోని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయం నందు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ చేతులమీదుగా నరసరావుపేట రూరల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పొందుగల వెంకటేశ్వరరావు కి మరియు నరసరావుపేట వన్ టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా గుండా రాజేష్ కి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనల ప్రకారం పార్టీ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అభ్యున్నతికి తోడ్పడి మంచి కార్యక్రమాలు చేపట్టి పార్టీని ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వల్లెపు కృపారావు, ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు, ఇత్తడి కిరణ్, జిల్లా నాయకులు జన్నాభట్ల ఆదిత్య, హాస్పిటల్ కమిటీ మెంబర్ తవ్వా మల్లికార్జున, చీమకుర్తి రాజా, ఆలపాటి త్రినాథ్, మెరుమూరి గురుబ్రహ్మం, కాటా ఆంజనారెడ్డి, గొడవర్తి సత్యనారాయణ, ముత్యాల మహేష్, ఉట్ల శ్రీనివాసరావు, తురిమెళ్ళ సుబ్రహ్మణ్య దినకర్, దైండే కిషోర్, కొప్పురావురి హనుమంత రావు, కాసా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.








