టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్… ఇంగ్లాండ్‌పై ఉత్కంఠ విజయం

టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్… ఇంగ్లాండ్‌పై ఉత్కంఠ విజయ 🏏

ముంబై/న్యూఢిల్లీ:మార్చి 06, అనంత జనశక్తి న్యూస్ 

అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న ఇరవై ఓవర్ల ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు మరోసారి తన సత్తా చాటింది. గురువారం జరిగిన రెండో అర్ధాంతర పోటీలో ఇంగ్లాండ్ జట్టును 7 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి తుదిపోటీకి దూసుకెళ్లింది. ఆదివారం (మార్చి 8) జరిగే తుదిపోటీలో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.

భారత్ భారీ పరుగులు

నాణెం విసురులో ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు, శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు చేసి జట్టు స్కోరును భారీగా పెంచారు.

పోరాడి ఓడిన ఇంగ్లాండ్

254 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు గట్టి పోరాటం చేసింది. ముఖ్యంగా యువ ఆటగాడు జాకబ్ బెథెల్ కేవలం 45 బంతుల్లో శతకం పూర్తి చేసి మొత్తం 48 బంతుల్లో 105 పరుగులు (8 నాలుగులు, 7 ఆరుగులు) చేసి భారత బౌలర్లకు గట్టి సవాల్ విసిరాడు.అయితే కీలక సమయంలో జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులకే పరిమితమైంది.

పోటీ శ్రేష్ఠుడు: సంజూ శాంసన్ (89 పరుగులు).

జాకబ్ బెథెల్ మెరుపు శతకం చేసినప్పటికీ భారత ఆటగాళ్ల సమిష్టి కృషి వల్ల ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం జరిగే భారత్–న్యూజిలాండ్ తుదిపోటీపైనే ఉంది.