
ప్రజా దర్బార్… ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం…
-ధర్మవరం పట్టణం ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం “ప్రజా దర్బార్” – ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం!
శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, నవంబర్ 13, అనంత జనశక్తి న్యూస్:
ధర్మవరం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, రేపు శుక్రవారం (14-11-2025) ఉదయం 10:30 గంటలకు ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో “ప్రజా దర్బార్” కార్యక్రమం నిర్వహించబడనుంది.ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు కి సమర్పించుకునే సదవకాశం కలుగుతుంది. ప్రజల అభ్యర్థనలను స్వయంగా విని తగిన పరిష్కార చర్యలు తీసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది.ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మరియు మిత్రులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.








