మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ నుంచి చంద్రబాబుకు ప్రశంసలు

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ నుంచి చంద్రబాబుకు ప్రశంసలు

విజయవాడ జనవరి 06, అనంత జనశక్తి న్యూస్

గుంటూరు వేదికగా జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పాల్గొని, తెలుగు భాష-సంస్కృతుల గొప్పతనాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“ఇండియా వచ్చినప్పుడల్లా మీ పేరే వినిపిస్తుంది. ఐటీ అనగానే చంద్రబాబే గుర్తుకొస్తారు” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా ప్రశంసించారు.మారిషస్‌లో విద్య, ఐటీ రంగాలు, అలాగే తెలుగు భాష-సంస్కృతి అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి అభినందనీయం అని గోకుల్ పేర్కొన్నారు.తెలుగు భాషాభివృద్ధికి చంద్రబాబు నిరంతరం చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.