శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మార్చి 14″అనంత జనశక్తి న్యూస్”

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది మహోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.నల్లమల అడవుల మార్గం గుండా పాదయాత్ర చేస్తూ కన్నడ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి చేరుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, భోజన సదుపాయం, చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు.శ్రీశైలం ఉగాది ఉత్సవాల్లో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.