
తిరుమలలో శ్రీవారికి అనంత్ అంబానీ భారీ విరాళం
తిరుమల, జూన్ 28:అనంత జనశక్తి న్యూస్
ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.27.5 కోట్ల వ్యయంతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయడానికి ఆయన అంగీకరించారు.అంతేకాకుండా, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బస్సులను నడిపే డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుందని అనంత్ అంబానీ వెల్లడించారు.ఈ సహకారంతో తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.








