
విశాఖలో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
విశాఖపట్నం మార్చి 23, అనంత జనశక్తి న్యూస్
విశాఖపట్నంలో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలక పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు.మొదటగా విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించనున్న కుమారస్వామి, అక్కడి కార్యకలాపాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు.తదుపరి సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొనడం విశేషం.ఈ పర్యటన ద్వారా రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.








