
ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో చిల్డ్రన్ పార్క్ ప్రారంభం
జోయాలుకాస్ వారి సౌజన్యంతో కోటి 20 లక్షల నిధులతో ఏర్పాటుచేసిన చిల్డ్రన్ పార్క్
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో జాలుకాస్ అధినేత సహకారంతో ఏర్పాటుచేసిన సుందరమైన చిల్డ్రన్ పార్క్
జోయలుక్కాస్ ఫౌండేషన్ అత్యాధునిక శ్రీ సత్యసాయి పార్కును ఆవిష్కరించింది ఆహ్లాదం ఆనందానికి నిలువెత్తు నిదర్శనం
చిత్రావతి నదీ తీరాన చిల్డ్రన్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె సుందర రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, జాయ్ లుకాస్ అధినేత జాలి జాయ్ జోయాలుకాస్,
పుట్టపర్తి నవంబర్ 13, అనంత జనశక్తి న్యూస్
ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం భగవాన్ సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తిలో శతజయంతి ఉత్సవాలకు దే దివ్య ప్రమాణంగా దీపకాంతులతో విరాజుల్లుతుంది ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జయాలుకాస్ వారు తమ వంతుగా కోటు 20 లక్షలతో పుట్టపర్తిలో పార్కు నిర్మాణం చేపట్టి నేడు ప్రారంభోత్సవానికి కేరళ నుంచి జోయాలుకాస్ మేనేజింగ్ ట్రస్ట్ జోలి జోయాలుకాస్ ప్రత్యేక హెలిపాడ్ లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న జోలికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఘన స్వాగతం పలికారు, అనంతరం ప్రశాంత్ నిలయంలోని సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారు.నవంబర్ 23, 2025న పుట్టినరోజు వచ్చే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క గ్రాండ్ సెంటెనరీ సెలబ్రేషన్స్ సన్నాహాల్లో భాగంగా, పుట్టపర్తిలో అద్భుతమైన శ్రీ సత్యసాయి పార్క్ ప్రారంభించబడింది. ఈ ఉద్యానవనం జోయలుక్కాస్ గ్రూప్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) చొరవ, దీనిని జోయలుక్కాస్ ఫౌండేషన్ అమలు చేసింది, మొత్తం పెట్టుబడి ₹1.20 కోట్లు.పార్కును శ్రీమతి జాలీ జాయ్ అలుక్కాస్, జోయలుక్కాస్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్,సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్, లు చిత్రావతి నదీ తీరాన సత్యసాయి పార్కును ప్రారంభించారు, మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డిమాట్లాడుతూ సత్య సాయి బాబా తన సేవాస్ఫూర్తితో విద్య వైద్యము త్రాగునీరు పేదలకు అందించారని ఆయన సేవలు మరవరానివని. శత జయంతి ఉత్సవాలలో పుట్టపర్తికు వచ్చే భక్తులకు ఈ పార్కు ఈ చిత్రావతి బ్యూటిఫుల్ ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలియజేశారు.ఆ తర్వాత శ్రీమతి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, సవితమ్మ మాట్లాడుతూ. సత్య సాయి బాబా లవ్ ఆల్ సర్వాల్ అనే నినాదంతో ప్రపంచ మానవాళికి ప్రేమ స్వరూపుడై భక్తుల మదిలో నిలిచి ఉంటారని పుట్టపర్తి కి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలను సమకూర్చమని బాబా శతజయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి పుట్టపర్తికి భక్తులు వస్తారని అలాంటి సందర్భంలో జోయాలుకాస్ వారు ఇక్కడ పార్కును ఏర్పాటు చేయడం ఎంతో అభినందనని పుట్టపర్తికి వచ్చే పర్యాటకులకు ఈ పార్క్ మంచి అనుభూతినిస్తుందని తెలియజేశారు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి, మాట్లాడుతూ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నా అభ్యర్థన మేరకు రాష్ట్ర పండుగగా గుర్తించి అన్ని సదుపాయాలు సమకూర్చడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని. సత్య సాయి బాబా తన బోధనలతో ప్రపంచ దేశాలను పుట్టపర్తి వైపు చూసేలా చేశారని ఆయన అందించిన డివైన్ లవ్ సేవాస్ఫూర్తి ప్రేమతత్వము ప్రతి ఒక్కరి మధ్యలో నిలిచిపోయాయని. ఆయన బాబా చూపిన బాటలోనే పుట్టపర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని. ఈరోజు జాలుకాస్ వారు అడిగిన వెంటనే కోటి 20 లక్షలతో చిత్రావతి నది ఒడ్డున మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో పార్కులు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని. జయాలుకాస్ ప్రతినిధులకు సత్యసాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేశారు. జోయాలుకాస్ అధినేత జాలి జోయాలుకాస్ మేనేజింగ్ ఫౌండేషన్ జోయలుక్కాస్ ఫౌండేషన్. మాట్లాడుతూ పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన చిత్రావతి నది తీరాన కొత్తగా ప్రారంభించిన ఈ పార్క్ ఆధునిక వినోద మరియు పర్యావరణ అనుకూల సౌకర్యాలు వంటి లష్ గార్డెన్స్, చెట్లతో కప్పబడిన నడక మార్గాలు, సురక్షితమైన పరికరాలు తో పిల్లల ఆట స్థలం, ఓపెన్-ఎయిర్ జిమ్ తో జాగింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్ లు, యోగా పెవిలియన్, అడ్వెంచర్ జోన్, వాటర్ ఫౌంటెన్ ప్లాజా, ధ్యాన మూలలు, మరియు షేడెడ్ సీటింగ్ ప్రాంతాలు. స్మార్ట్ మరియు స్థిరమైన లక్షణాలలో సౌరశక్తితో నడిచే లైటింగ్ మరియు సమర్థవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ ఉన్నాయి.ఈ అర్ధవంతమైన చొరవ ద్వారా, జోయలుక్కాస్ ఫౌండేషన్ ఆరోగ్య సంరక్షణ, విద్య, సమాజ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మరియు సాధికారత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది, శారీరక శ్రేయస్సు, విశ్రాంతి మరియు సమాజ సామరస్యాన్ని ప్రోత్సహించే సురక్షితమైన, స్వచ్ఛమైన మరియు స్ఫూర్తిదాయకమైన వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో ఉంది. శ్రీ సత్యసాయి పార్క్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క దైవిక వారసత్వానికి శాశ్వత నివాళిగా నిలుస్తుంది, ఇది రాబోయే తరాలకు ప్రేమ, సేవ మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది.








