
షిరిడి సాయిబాబా మందిరము నిర్మాణానికి రూ.50,000/- వేల రూపాయలు విరాళం అందజేసిన డీకే బాబు
తలుపుల డిసెంబర్30 (అనంత జనశక్తి న్యూస్):-
మండలం పరిధిలోని గుండువారిపల్లి పంచాయితీ, గుండువారిపల్లి క్రాస్ నందు శ్రీ షిరిడి సాయిబాబా మందిరము నిర్మాణానికి తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు రూ.50,000/- వేల రూపాయలు వారి ఆఫీస్ నందు అందజేశారు.శిరిడి సాయిబాబా మందిరము నిర్మాణానికి అడిగిన వెంటనే సహాయాన్ని అందజేసిన డీకే బాబు కి గుండు వారి పల్లి గ్రామ ప్రజలు మరియు మందిరము కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కులశేఖర్ రెడ్డి, వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు ఆవుల వివేకానంద రెడ్డి, మౌలా, ఉత్త రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యర్రం రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీనాథ్, మరియు మందిరం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..








