హరియాణాలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు: రాహుల్‌

హరియాణాలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు: రాహుల్

దిల్లీ: హరియాణాలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఓట్‌చోరీపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘హరియాణాలో మేం గెలుస్తామని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి.. కానీ ఓడిపోయాం. రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగింది. భాజపాకు ఈసీ సహాయం చేసింది. యూపీలో ఓటు వేసిన వారు వేల సంఖ్యలో హరియాణాలోనూ ఓటు వేశారు. భాజపా వాళ్లు అయినంతమాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా?’’ అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.