
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు…
ఉద్రిక్తతలు పతాక స్థాయికి
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రమవుతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.అమెరికా ఇరాన్పై భారీ స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టినట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతను మరింత పెంచాయి.ట్రంప్ హెచ్చరికలకు కౌంటర్గా ఇరాన్ గట్టి స్పందన వ్యక్తం చేసింది. అవసరమైతే ప్రపంచ నౌకా రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది.ఇక అమెరికాతో సంబంధం ఉన్న కంపెనీలను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ట్రంప్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా తీసుకుంటూ ఐఆర్జీసీ “You are fired” అంటూ వీడియో విడుదల చేయడం గమనార్హం. “ఈ విషయంపై మీ దృష్టికి ధన్యవాదాలు” అంటూ వెటకారం కూడా చేసింది.మొత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ప్రమాదకర దిశగా సాగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్నాయి.








