కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్?

కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్?

న్యూఢిల్లీ జూన్ 16, అనంత జనశక్తి న్యూస్

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విస్తరణలో భాగంగా అధికార కూటమి భాగస్వామి తెలుగుదేశం పార్టీకి మరో సహాయ మంత్రి పదవి దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు.ఇదిలా ఉండగా, కూటమిలోని మరో భాగస్వామి జనసేన పార్టీకి కూడా ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే జనసేనకు మంత్రి పదవి ఆఫర్ చేసిన అంశంపైనా, పవన్ కళ్యాణ్ వైఖరిపైనా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలుగానే ఉన్నాయి.