ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గింపు 

ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గింపు

సీఎం చంద్రబాబు స్వాగతం

అమరావతి మార్చి 28 అనంత జనశక్తి న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితమని ఆయన పేర్కొన్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల సామాన్య ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయంలో నాయకత్వం ఎంత ముఖ్యమో ఇలాంటి నిర్ణయాలు చూపిస్తాయని ఆయన అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి స్థిరత్వం ఏర్పడుతోందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయమని చంద్రబాబు తెలిపారు.ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో రవాణా ఖర్చులు తగ్గి, మార్కెట్‌లో వస్తువుల ధరలపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.