
సీఐ శ్రీహర్ష ఉద్యోగం నుంచి తొలగింపు
ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్ళు కూడా..
అనంతపురం ఏప్రిల్ 27, అనంత జనశక్తి న్యూస్
హనీట్రాప్ కేసులో పోలీసు శాఖ అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. హనీట్రాప్ ముఠాను నడిపించిన రంగమ్మ నాయుడుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన రాప్తాడు సీఐ శ్రీహర్షను ఉద్యోగం నుంచి తొలగించింది. `రిమూవ్డ్ ఫ్రం సర్వీస్` అని ప్రకటించింది. హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవలా నాయక్ను కూడా ఉద్యోగాల నుంచి తొలగించింది. అనంతపురం రూరల్ సీఐ శేఖర్ను కర్నూలు డీఐజీకి సరెండర్ చేశారు. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్ను సస్పెండ్ చేశారు.అనంతపురం జిల్లాలో మునుపెన్నడూ ఈ స్థాయిలో పోలీసులపై వేటు పడిన దాఖలాలు లేవు.








