ఇది చాలా మంది భక్తులకు తెలుసే ఉంటుంది..

ఇది చాలా మంది భక్తులకు తెలుసే ఉంటుంది..

కాని తెలియని వారి కోసం..

తిరుమలలో స్వామి వారి సహస్ర దీపాలంకార సేవ పూర్తి అయ్యాక స్వామి వారు నాలుగు మాఢ వీధులలో ఊరేగింపుగా వస్తారు.సాయంత్రం 5.24 నిమిషాల తర్వాత..మీరు కొండ మీద ఎక్కడ ఉన్నా మైకులలో గోవింద నామాలు మొదలవ్వగానే ( శ్రీనివాస గోవింద..శ్రీ వెంకటేశ గోవింద) అని వినపడగానే మీరు వెంటనే వరాహస్వామి ఆలయం దగ్గరకు వచ్చేయండి..( ఇక్కడ కొంత సేపు ఊరేగింపు ఆపుతారు)ఈ ఊరేగింపు అక్కడకు రావడానికి ఇరవై నిమిషాలకు పైగా పడుతుంది.. మలయప్ప స్వామిని దగ్గర నుండి కనులారా చూడవచ్చు.మీరు కుటుంబ సమేతంగా వెళ్ళితే( మీ శ్రీమతిని) అక్కడ హారతి ఇవ్వండి..వెళ్ళేటప్పుడు ఇత్తడి పళ్ళెం, కర్పూరం, ప్రసాదం గా మీకు నచ్చినవి పెట్టి హారతి తర్వాత అక్కడి భక్తులకు పంచి పెట్టండి.ఊరేగింపు తర్వాత గుడిలోనికి ప్రవేశించి….బంగారు వాకిలి లోపల హారతి ఇస్తారు..మీరు గుడి లోపల ఐదు గంటల తర్వాత ఉన్నట్లయితే అక్కడే వేచి చూడండి.. హుండీ దగ్గర తాడు కడతారు..అక్కడ ఉంటే మీరు దగ్గర్నుంచి చూడవచ్చు.