
పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
విజయవాడ మార్చి 14,”అనంత జనశక్తి న్యూస్”
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత గ్యాస్ సరఫరా పరిస్థితిని మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు.గ్యాస్ సరఫరా అంశంపై చర్చించేందుకు ఉదయం 11.30 గంటలకు మంత్రుల సబ్ కమిటీ సమావేశం కానున్నట్లు మంత్రులు సీఎంకు తెలిపారు.రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన చర్యలన్నింటిని తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.అలాగే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.








