ఆస్తి కోసం మహిళ నిరసన దీక్ష.

ఆస్తి కోసం మహిళ నిరసన దీక్ష.

-చేనేత మహిళ జింకా సరోజమ్మ ఒకరోజు నిరసన దీక్ష.

-న్యాయం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి విజ్ఞప్తి.

ధర్మవరం నవంబర్ 8, అనంత జనశక్తి న్యూస్:

పట్టణంలోని శాంతినగర్ లో తన ఆస్తి తనకు ఇవ్వాలంటూ, దీనికి కొందరు తమ కుటుంబ సభ్యులు అడ్డు పడుతున్నారని, ఆస్తి హక్కు తనకు ఉండగా వీళ్ళు తన హక్కులను కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. ధర్మవరం శాంతి నగర్ లో ఒక ఇంటి ముందు జింకా సరోజమ్మ చేనేత మహిళ, తన సమస్యకు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయo చేయాలని ఈ మహిళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ కు విజ్ఞప్తి చేసింది. తన ఆస్తి తనకు ఇప్పించాలని తన కుమారుడి పెళ్లి చేయాలని, అoదుకు గాను ఖర్చుల కోసం తనకు రావా ల్సిన ఆస్తి రూ 30 లక్షలు ఆస్తి తనకు ఇప్పించండి అంటూ….. తన దీక్ష లో చేనేత మహిళ జింకా సరోజమ్మ విన్నవించినది.