Logo
Date of Publish : 20 September 2025, 8:37 am
Editor : Shankaragallu Venkatesulu

మదిలో ఉన్నా… మరిచిపోతున్నారు 

మదిలో ఉన్నా... మరిచిపోతున్నారు

డా. పి. కార్తీక్ రెడ్డి

కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్

కిమ్స్ సవీర, అనంతపురం.

అల్జీమర్స్ మెదడులో కణాలు చనిపోతుండటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బదింటాయి. ఇటీవలి సంఘటనలు, విషయాలను మరచిపోవటంతో మొదలై క్రమంగా పెరిగి చివరకు వ్యక్తి తనెవరో తెలియని స్థాయికి ఈ మతిమరపు విస్తరిస్తుంది.అల్జీమర్స్ ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి. కానీ ఇప్పుడు యుక్త వయసులో కూడా ప్రభావం చూపుతోంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని పరిస్థితి. ఈవేళ ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ అల్జీమర్స్‌కీ, ఒత్తిడికీ అవినాభావ సంబంధముంది. అల్జీమర్ ఏ వయసులోనైన రావచ్చు.చాలామంది వయసు మళ్ళిన వారిలో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఈ వ్యాధి మన జీవితాన్ని తలకిందులు చేస్తుందని. వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చిందంటే తమకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందేమోనని భయపడతారు. నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్‌ వ్యాధికి దారి తీయవు. సంబంధిత విషయంపై ఆసక్తిలేకపోయినా మతిమరుపు రావచ్చు. మతిమరపునకు చాలా కారణాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు పక్షవాతం, మెదడులో గడ్డలు, రక్తస్రావం వంటివి. అయితే రోగికి వచ్చిన మతిమరుపు అన్నది అల్జీమర్ కారణంగానేనని నిర్ధారణ చేయడం ఒకింత కష్టమైన పనే. దీనికి సిటి స్కాన్, ఎంఆర్ఐ (బ్రెయిన్)వంటి పరీక్షలు దోహదపడుతాయి. ఇందులో మెదడు కుచించుకుపోయినట్లుగా కనిపించడాన్ని బట్టి అల్జీమర్స్‌గా గుర్తించవచ్చు .వ్యాధి మొదటి స్టేజీలో ఉన్నప్పుడే గుర్తించి వారికి ఆటలు, సోషల్ యాక్టివిటీస్‌ చేయించాలి. మంచి పోషకహారాన్ని అందిస్తే కొంత మేర మార్పు చేయవచ్చు. పక్షవాతాన్ని డయాబెటిస్‌ను నివారించడానికి అనుసరించే సాధారణ జీవనశైలి సూచనలే అల్జీమర్స్‌ను నివారిస్తాయి. వ్యాయామంతో 70-80 ఏళ్ల వయస్సు వచ్చినా సరే ఉల్లాసంగా ఉండొచ్చు. వారానికి 5 సార్లు 20 నుంచి 40 నిముషాలు నడిచేవాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పొగ, మద్యం తాగడం పూర్తిగా మానివేయాలి. ఎక్కువగా పండ్లు, చిరుధాన్యాలు, ఆకుకూరలు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు సరిగా రక్తం సరఫరా అయ్యేలా చేసి చురుగ్గా పని చేసేలా చేస్తాయి. సాల్మన్ చేపలు - ఇందులోని ఒమెగా ఫ్యాట్స్ బ్రైస్ పవర్ పెంచి అల్జీమర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి. అవిసె గింజలు: ఏయల్‌ఏ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు సెన్సరీ సందేశాలను మెదడుకు చేర్చి మెదడుకు పదును పెడతాయి. కాఫీ-కెఫీన్‌ను మితంగా తీసుకుంటే మతిమరుపును పోగొట్టి అల్జీమర్ వ్యాధి రాకుండా చేయడమే కాక అందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి. నట్స్ - వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఏపిల్ జ్యూస్ "జ్ఞాపక రసాయనం" అసిటిల్కోలిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చాకొలెట్ చాలా రుచికరమైన బ్రెయిన్ ఫుడ్. ముదురు రంగులోని చాకోట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఏకాగ్రతని, అవగాహనా శక్తిని పెంచి విద్యార్థులలో స్పందన, గ్రాహ్యక శక్తిని కూడా పెంచుతుంది


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)