Logo
Date of Publish : 19 March 2026, 9:40 am
Editor : Shankaragallu Venkatesulu

ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభం 

ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభం

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు

విజయవాడ మార్చి 19, అనంత జనశక్తి న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై వేడుకలను ప్రారంభించారు.వేదికపై జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి, ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.అలాగే, పండితుడు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించి నూతన సంవత్సర ఫలితాలను వివరించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)