జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
నెల్లూరు మార్చి 19, అనంత జనశక్తి న్యూస్
నెల్లూరు జిల్లా జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో గురజాల కోర్టు నిన్న ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, 98 రోజుల జైలు జీవితం అనంతరం విడుదల అయ్యారు.ఈ కేసులో ఏ-6 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి, నెల్లూరు జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. విడుదల నేపథ్యంలో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ముందస్తు చర్యగా 144 సెక్షన్ అమలు చేశారు.విడుదల అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తమను లక్ష్యంగా చేసుకుని జైలుకు పంపించారని ఆరోపించారు.ఇంకా మాట్లాడుతూ, “మాకూ ఒక రోజు వస్తుంది… ఆ రోజు ఈ కుట్రల వెనుక ఉన్న వారిని వదిలిపెట్టం” అని హెచ్చరించారు.మొత్తంగా ఈ పరిణామం పాలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.