Logo
Date of Publish : 03 November 2025, 7:28 am
Editor : Shankaragallu Venkatesulu

వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

విజయవాడ నవంబర్ 03, అనంత జనశక్తి న్యూస్

విజయవాడ ఐటీఐ కాలేజ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, వీఐపీ, ఏసీ జనరల్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగి అందుబాటులోని సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లోకేష్ ను ఆసుపత్రి నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ జి.లక్ష్మీ కుమార్, సీఈవో కె.సుధాకర్ తో పాటు ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్), మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)