Logo
Date of Publish : 28 March 2026, 3:34 am
Editor : Shankaragallu Venkatesulu

ఉమ్రా యాత్ర పేరిట భారీ మోసం 

ఉమ్రా యాత్ర పేరిట భారీ మోసం

కర్నూలులో కలకలం

కర్నూలు మార్చి 27 అనంత జనశక్తి న్యూస్

ఉమ్రా యాత్ర పేరుతో జిల్లాలో భారీ మోసం వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. యాత్రకు పంపిస్తామని నమ్మబలికి ఓ ముఠా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి, ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.40 వేల చొప్పున వసూలు చేసి, వెయ్యి మందికి పైగా బాధితుల నుంచి మొత్తం దాదాపు రూ.4 కోట్లు దోచుకున్నట్లు సమాచారం. బాధితులు కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.డబ్బులు తీసుకున్న తర్వాత ఉమ్రా యాత్రకు పంపకుండా నిందితుడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యాత్రల పేరుతో డబ్బులు చెల్లించే ముందు పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)