త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
భన్త కనకదాస విగ్రహానికి ఘన నివాళులు
కురబలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం
కనకదాస జయంతికి శాశ్వత జీవో ఇచ్చాం
హామీ నెరవేర్చి మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు
గొర్రెల పెంపకం యూనిట్ల ఏర్పాటు
ఆదరణ 3.0లో గొర్రెల సంరక్షణకు అధునాత ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రాధాన్యం
తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటు : మంత్రి సవిత
పెనుకొండ నవంబర్ 08 ,అనంత జనశక్తి న్యూస్
టీడీపీతోనే కురబలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంగా అందజేయనున్నారు. స్వయం ఉపాధి పథకాల అమలులో భాగంగా కురబలకు గొర్రెల యూనిట్లు అందజేయనున్నారు. ఆదరణ 3.0 ద్వారా గొర్రెల సంరక్షణకు ఆధునాతన ఫెన్సింగ్, ఎల్ఈడీ లైట్లు కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. భక్త కనకదాసు జయంతి సందర్భంగా శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆయన విగ్రహానికి కురుబ కులస్తులు, కూటమి నాయకులతో కలసి పూల మాలలు వేసి నివాళులు మంత్రి సవిత ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భక్త కనకదాస సామాజిక తత్వవేత్త, స్వరకర్త అని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతులపైనా, కుల వ్యవస్థపైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన సంఘ సంస్కర్త భక్త కనకదాస అని అన్నారు. ఆ మహానీయుని జయంతి శాశ్వత రాష్ట్ర పండుగగా నిర్వహించేలా కూటమి ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీతోనే కురబలకు ప్రోత్సాహం...
బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారని మంత్రి సవిత తెలిపారు. ముఖ్యంగా కురబలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు టీడీపీ వల్లే వచ్చిందన్నారు. కురబ సామాజిక వర్గానికి చెందిన తన తండ్రి సంజీవరెడ్డిగారి రామచంద్రారెడ్డిని అన్న ఎన్టీఆర్ రాజకీయంగా ప్రోత్సాహించారన్నారు. అనంతరం సీఎం చంద్రబాబుకు కూడా రామచంద్రారెడ్డికి రాజకీయ అండదండలు అందించారన్నారు. ఈ ప్రోత్సాహంతో తన తండ్రి 14 శాఖలకు మంత్రిగానూ, టీటీడీ బోర్డు మెంబర్ గానూ పనిచేశారన్నారు. ప్రస్తుత ఎంపీ బీకే పార్థసారథిని సైతం అదేస్థాయిలో రాజకీయ ప్రోత్సాహం లభించిందన్నారు. ఇప్పుడు తనను కూడా పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి, బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రిగా అవకాశమిచ్చారన్నారు. స్థానిక సంస్థల్లోనూ కురబలకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తోందన్నారు.
గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం
గత ఎన్నికల్లో కురబలకు ఎన్టీయే కూటమి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చితీరుతామని మంత్రి సవిత తెలిపారు. గత ఎన్నికల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చిన మేరకు భక్త కనకదాస జయంతికి సంబంధించి శాశ్వత జీవో తీసుకొచ్చామన్నారు. హామీని నెరవేర్చినందుకు మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. శాశ్వత జీవోలో భాగంగా మొదటి రాష్ట్ర స్థాయి కనకదాస జయంతికి మంత్రి నారా లోకేశ్ హాజరుకావడం ఆనందకర విషయమన్నారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు దేవాలయాల నిర్వహణ కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. గొర్రెల యూనిట్ల ఏర్పాటుకు స్వయం ఉపాధి రుణాలు అందజేస్తామన్నారు. ఆదరణ 3.0 అమలులో భాగంగా గొర్రెల సంరక్షణకు అధునాత ఫెన్సింగ్, ఎల్ఈడీ బల్పులు అందజేస్తామన్నారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇదే విషయమై ఇప్పటికే టీటీడీ చైర్మన్ తో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారన్నారు. అంతకుముందు భక్త కనకదాస జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కురబ సామాజిక వర్గీయులు, పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.