మత్తులో ఊగుతున్న మైనర్లు -
సిగరెట్తో మొదలెట్టి గంజాయి దాకా
చెడు వ్యసనాలతో బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్న మైనర్లు - తరగతులు ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగడం - మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిలో 30 శాతం మంది మైనర్లే ఆంధ్రా... ఏపీలో డ్రగ్స్పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ దీని జాడ్యం ఇంకా పూర్తిగా పోలేదు. ముఖ్యంగా అధిక స్థాయిలో డ్రగ్స్ను మైనర్ బాలురు వినియోగిస్తుండటం విచారించదగ్గ విషయం. సిగరెట్లతో మొదలెట్టి గంజాయి వాడకం వరకూ వీరు వెళ్లిపోతున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే యువభారతం డ్రగ్స్ ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. మత్తు పదార్థాలకు బానిసైన వారిలో ఎక్కువమంది మైనర్లే ఉంటున్నారు. తొలుత స్నేహితుల ఒత్తిడితో రుచి చూస్తున్నారు. బాల్యంలో చెడు సావాసాలకు ఆకర్షితులై పక్కదారి పడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం, కుటుంబ గౌరవం, ధన నష్టం, భవిష్యత్తు దెబ్బతింటున్నాయి. జిల్లా వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఈ తరహా సంస్కృతి పెరుగుతోంది. పోలీసులు నమోదు చేసిన కేసుల గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.30 శాతం మంది మైనర్లే: మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిలో 30 శాతం.