Logo
Date of Publish : 05 July 2026, 5:12 am
Editor : Shankaragallu Venkatesulu

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు..

ముమ్మరంగా గాలింపు చర్యలు

విశాఖపట్నం, జూలై 5:అనంత జనశక్తి న్యూస్

విశాఖపట్నం నుంచి జూలై 1న చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారితో ఎలాంటి సంబంధం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మత్స్యకారుల మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో వారి ఆచూకీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మత్స్యకారుల కుటుంబ సభ్యులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని దిశల్లో గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం తమ వారిని క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)