విశాఖలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన
భోగాపురం రోడ్లపై కీలక అప్డేట్
ఎవరికీ అన్యాయం జరగనివ్వం
మురికివాడల వాసులకు మంత్రి నారాయణ భరోసా.
సిటీ టు ఎయిర్పోర్ట్.. రోడ్ల నిర్మాణంలో వేగం.
విశాఖపట్నం మార్చి 14 అనంత జనశక్తి న్యూస్
విశాఖపట్నం నగర అభివృద్ధిని పరుగులు పెట్టించేలా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ప్రణవ గోపాల్ బృందం నగరంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాన్ని మంత్రి వేగవంతం చేశారు; ఇప్పటికే 54 శాతం పనులు పూర్తయ్యాయని, ఎయిర్ పోర్ట్ ప్రారంభం నాటికి నేరెళ్ళవలస, కొత్తవలస, భీమిలి వంటి కీలక మార్గాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, సీతమ్మధార ఏ ఎస్ ఆర్ నగర్ మురికివాడలోని 200 కుటుంబాల ఏళ్లనాటి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి, స్థలం యజమానుల నుండి వస్తున్న బెదిరింపులపై స్పందించారు.ఎవరికీ అన్యాయం జరగకుండా మురికివాడను ఆధునీకరిస్తామని నివాసితులకు భరోసా ఇచ్చారు. వి.ఎం.ఆర్.డి.ఏ, ఆర్ & బి మరియు జీవీఎంసీ అధికారుల సమన్వయంతో విశాఖ రూపురేఖలు మార్చడమే లక్ష్యమని ఈ పర్యటన ద్వారా మంత్రి చాటిచెప్పారు.